వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్థ‌ర్‌కు అరుదైన గౌర‌వం

కర్నూలు: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్థర్‌కు అరుదైన గౌరవం దక్కింది. కరోనా సమయంలో త‌న నియోజకవర్గ ప్ర‌జ‌ల‌కు ఆయన విశేష సేవ‌లు అందించారు. ప్రజలకు అందుబాటులో ఉండటం, కరోనా బాధితులను పరామర్శించడం, సొంత నిధులతో కూలీలు, కార్మికులకు శానిటైజర్లు, మాస్కు​లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సేవలను గుర్తించిన లండన్‌ వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ సంస్థ ‘సర్టిఫికెట్‌ ఆఫ్‌ కమిట్‌మెంట్‌’ ఇచ్చేందుకు ఎమ్మెల్యే ఆర్థ‌ర్‌ను ఎంపిక చేసింది. త్వరలో నందికొట్కూరులో జరిగే కార్యక్రమంలో ఎమ్మెల్యేను సన్మానించి సర్టిఫికెట్‌ అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థ‌ర్ మాట్లాడుతూ.. కరోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం శ్రమించారన్నారు. సీఎం సూచనల మేరకు తాను నియోజకవర్గంలో నిత్యం ప్రజల మధ్య ఉంటూ కోవిడ్‌ నివారణకు కృషి చేశానని చెప్పారు. 

Back to Top