రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్థర్కు అరుదైన గౌరవం
12 Nov 2021 10:14 AM
కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్థర్కు అరుదైన గౌరవం దక్కింది. కరోనా సమయంలో తన నియోజకవర్గ ప్రజలకు ఆయన విశేష సేవలు అందించారు. ప్రజలకు అందుబాటులో ఉండటం, కరోనా బాధితులను పరామర్శించడం, సొంత నిధులతో కూలీలు, కార్మికులకు శానిటైజర్లు, మాస్కులు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సేవలను గుర్తించిన లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ ‘సర్టిఫికెట్ ఆఫ్ కమిట్మెంట్’ ఇచ్చేందుకు ఎమ్మెల్యే ఆర్థర్ను ఎంపిక చేసింది. త్వరలో నందికొట్కూరులో జరిగే కార్యక్రమంలో ఎమ్మెల్యేను సన్మానించి సర్టిఫికెట్ అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నిరంతరం శ్రమించారన్నారు. సీఎం సూచనల మేరకు తాను నియోజకవర్గంలో నిత్యం ప్రజల మధ్య ఉంటూ కోవిడ్ నివారణకు కృషి చేశానని చెప్పారు.