పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
వైయస్ రాజారెడ్డి ఆదర్శప్రాయుడు
24 May 2021 11:23 AM
వైయస్ రాజారెడ్డి వర్ధంతి కార్యక్రమంలో వైయస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ
పులివెందుల: దివంగత వైయస్ రాజారెడ్డి ఆదర్శప్రాయుడని వైయస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైయస్ విజయమ్మ పేర్కొన్నారు. ఆదివారం వైయస్ రాజారెడ్డి 23వ వర్ధంతిని పురస్కరించుకుని వైయస్ కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక డిగ్రీ కళాశాల రోడ్డులో గల వైయస్సార్ సమాధుల తోటలో వైయస్ రాజారెడ్డి, వైయస్ జయమ్మల సమాధుల వద్ద వైయస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, దివంగత జార్జిరెడ్డి సతీమణి వైయస్ భారతమ్మ, వైయస్సార్ సోదరుడు వైఎస్ సుదీకర్రెడ్డి, వైయస్సార్సీపీ సింహాద్రిపురం, లింగాల మండలాల ఇన్ఛార్జి ఎన్.శివప్రకాష్రెడ్డి, వైయస్సార్ సమీప బంధువు క్రిష్టఫర్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అక్కడే ఉన్న వైయస్ జార్జిరెడ్డి, వైయస్ వివేకానందరెడ్డి, డాక్టర్ ఇసీ గంగిరెడ్డిల సమాధులతోపాటు ఇతర బంధువుల సమాధుల వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్ప, వైయస్సార్సీపీ నాయకులు రసూల్, జగదీశ్వరరెడ్డి, పార్నపల్లె నాయుడు, కృష్ణమ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
నివాళులర్పించిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే
స్థానిక వైయస్సార్ సమాధుల తోటలోని వైయస్ రాజారెడ్డి సమాధి వద్ద ఆదివారం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి, రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి మాట్లాడుతూ దివంగత వైయస్ రాజారెడ్డి పేద ప్రజలపట్ల ఎంతో ప్రేమతో మెలిగేవారన్నారు. ప్రతి ఒక్కరు పేద ప్రజలకు సేవ చేయాలని ఆయన చెప్పేవారని గుర్తు చేసుకున్నారు.