హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ను కలిసిన వైయస్‌ షర్మిళ

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోదరి వైయస్‌ షర్మిళ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ను కలిశారు. సోషల్‌ మీడియాలో తన పట్ల , కుటుంబ సభ్యుల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీకి ఫిర్యాదు చేశారు. ఆమె వెంట వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేతలు  వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అనిల్‌కుమార్, వాసిరెడ్డి పద్మ ఉన్నారు. 
 

Back to Top