కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
నాపై దుష్ప్రచారం దుర్మార్గం..
14 Jan 2019 1:10 PM
వైయస్ షర్మిళ
చంద్రబాబుకు నైతిక విలువలు లేవా..?
హైదరాబాద్: అధికార తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుందని వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల మండిపడ్డారు. ఒక మహిళ అనే గౌరవం లేకుండా తెలుగుదేశం పార్టీ నాపై దుష్ప్రచారం చేస్తుందన్నారు.2014 ఎన్నికలకు ముందు దుష్ప్రచారం ఆన్లైన్లో ఒక క్యాంపెయిన్లా ఒక వర్గం నడిపిందన్నారు. మళ్లీ ఎన్నికల నేపథ్యంలో విషప్రచారానికి వేగం పెంచారని ధ్వజమెత్తారు. ఒక మహిళ పట్ల ఇంత చులకన భావంతో రాస్తున్న రాతలు, విష ప్రచారం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు.మహిళలకు రక్షణ, గౌరవం, హక్కులు..మానవహక్కులనేవి కాగితాలకు, చర్చలకు మాత్రమే పరిమితం కాకూడదన్నారు. మహిళల పట్ల జరుగుతున్న విష ప్రచారాన్ని ప్రజాస్వామవాదులు, నైతికత కలిగిన రాజకీయ నాయకులు, జర్నలిస్టులు ఖండించాలన్నారు.
నాపై విషపు రాతలు పట్ల మీడియా ముందుకు వచ్చి వాదనను వినిపించే దుస్థితికి రావడం సమాజంలో మహిళలందరికి అవమానకరమన్నారు. మాట్లాకపోతే కొంతమంది నిజం అనుకునే ప్రమాదం ఉందన్నారు. భర్తకు భార్యగా, తల్లిగా, చెల్లిగా నా నైతికతను నిరూపించుకోవలసిన అవసరం లేదని భగవంతునికి నా నైతికత తెలుసు అని అన్నారు. నా గౌరవాన్ని కాపాడుకోవలసి ఉందన్నారు. ఏ వ్యక్తితో సంబంధం ఉందో అని విష ప్రచారం చేస్తున్నారో ఆ వ్యక్తిని ఎప్పుడు చూడలేదు. ఒకసారి కూడా మాట్లాడలేదు..ఇది నిజమన్నారు. నా పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను అని పేర్కొన్నారు. రుజువులు, ఆధారాలు చూపించగలరా అని ప్రశ్నించారు. పుకార్లు పుట్టించి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. ఇంతటి దిగజారుడ ప్రచారాల వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీకి పుకార్లు పుట్టించడం కొత్తేమీకాదని, మా తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఫ్యాక్షనిస్టు అంటూ పుకార్లు పుట్టించింది తెలుగుదేశం పార్టీయే అని, నాన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషో రాష్ట్ర ప్రజలు చూశారన్నారు. అన్న వైయస్ జగన్ గర్విష్టి ,కోపిష్టి అని పుకార్లు పుట్టించింది కూడా తెలుగుదేశం పార్టీయే అని, ఆయన ఎంత సౌమ్యుడో ప్రజా సంకల్పయాత్ర ద్వారా ప్రజలకు తెలిసిందన్నారు. మహిళపై అసభ్య ప్రచారం చేస్తే చంద్రబాబు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడే ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
మీ కుటుంబంలో, పార్టీలో ఉన్న మహిళలకే ఆత్మగౌరవం ఉంటుందా అని చంద్రబాబును నిలదీశారు. దుష్ప్రచారాలు చేయించడం మాకు తెలియవని, మాకు విలువలు ఉన్నాయని మా అన్నకు నైతికత ఉందన్నారు. మా నాన్న ఎలా పోరాటం చేయాలో నేర్పారన్నారు. చంద్రబాబువి ఎప్పుడు మోసపూరిత ఆలోచనలే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నాయకులు అధికారంలో ఉనంత వరకు సమాజం బాగుపడదన్నారు.. నీచమైన రాజకీయాలు చేస్తూ పోతే శిక్ష తప్పదని. దేవుడు ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. దోషులను కఠినంగా శిక్షించాలని సీపీని కోరినట్లు షర్మిళ వివరించారు.