మహానేత కన్న కల జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాం

వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి
 

 

 హైదరాబాద్‌ : మహానేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి కన్న కల జలయజ్ఞాన్ని పూర్తి చేస్తామని వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  హామీ ఇచ్చారు. ప్రపంచ జల దినోత్సవాన్ని(మార్చి 22) పురస్కరించుకుని   లక్షలాది రైతు కుటుంబాలకు వెలకట్టలేని లబ్ధి చేకూర్చే జలయజ్ఞం వాగ్దానాన్ని పునరుధ్ఘాటించారు. నవరత్నాల్లోని జలయజ్ఞం వాగ్ధానంకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. పోలవరం మొదలు పెండింగ్‌లో ఉన్న హంద్రీనీవా, గాలేరునగరి, వెలుగొండ, వంశధార, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి.. అన్ని ప్రాజెక్టులను కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇదే నా జలయజ్ఞ వాగ్దానమని పేర్కొన్నారు.
 

Fulfillment of my father, Late Dr.YS Rajashekhar Reddy’s dream irrigation projects. Completion of all pending projects including Polavaram. This is my ‘Jalayagnam’ promise! #NavaRatnalu #WorldWaterDay pic.twitter.com/exdrzUCA82

— YS Jagan Mohan Reddy (@ysjagan) March 22, 2019

Back to Top