మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
కడప అమీన్ పీర్ దర్గాలో వైయస్ జగన్ ప్రార్థనలు
11 Jan 2019 4:48 PM
వైయస్ఆర్ జిల్లా: ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా ముగించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్రెడ్డి.. కొద్దిసేపటి క్రితం కడప అమీన్ పీర్ దర్గాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, దర్గా పెద్దలు జననేతకు ఘన స్వాగతం పలికారు. జననేత దర్గాలోచాదర్ సమర్పించారు.
ఇవాళ ఉదయం తిరుపతి నుంచి బయలుదేరిన వైయస్ జగన్కు వైయస్ఆర్ జిల్లా కుక్కలదొడ్డి వద్ద ఆత్మీయ స్వాగతం లభించింది. ఆ తరువాత కడప నగరంలో కూడా బ్రహ్మరథం పట్టారు. ప్రజా సమస్యలు తెలుసుకొని, వారితో మమేకమయ్యేందుకు 2017 నవంబర్ 6వ తేదీన ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించిన వైయస్ జగన్ సుదీర్ఘంగా పాదయాత్ర చేశారు. ఈ నెల 9వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పాదయాత్ర ముగించుకొని అక్కడి నుంచి నేరుగా తిరుపతికి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.