చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ఇంటర్ విద్యార్థులకూ ‘అమ్మఒడి’ వర్తింపు!
27 Jun 2019 2:13 PM
క్యాంపు ఆఫీసులో విద్యాశాఖ అధికారులతో సమీక్ష
హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూలు పిల్లలకు కూడా అమ్మఒడి వర్తింపు
వీసీల నియామకానికి సెర్చ్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈరోజు విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశం సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. పిల్లలను పాఠశాలకు పంపే ప్రతీ తల్లికి అమ్మఒడి పథకం కింద ఏటా రూ.15,000 ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా అమ్మఒడి పథకాన్ని ఇంటర్ విద్యార్థులకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించారు.
హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతీతల్లికి ఏటా రూ.15 వేలు ఇస్తామని పునరుద్ఘాటించారు. ఇక విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకం కోసం వెంటనే సెర్చ్ కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. రాబోయే 30 రోజుల్లోగా వీసీల నియామకాలు పూర్తికావాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో ఉన్న అన్ని ఖాళీలను ఏడాది చివరికల్లా భర్తీ చేయాలని చెప్పారు. పారదర్శక విధానంలో, అత్యంత అనుభవం ఉన్నవారినే వీసీలుగా ఎంపిక చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలనీ, మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని ఆదేశించారు.