రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

వైయ‌స్ జ‌గ‌న్ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు
 

హైద‌రాబాద్‌:  రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచే శక్తుల నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అందరం కలిసి పనిచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపునిచ్చారు. దేశ ప్ర‌జ‌ల‌కు, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న భార‌తీయుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు.

ప్రపంచంలోనే అత్యున్నతమైన, అత్యుత్తమైన రాజ్యాంగం అమలులోకి వచ్చి 69 సంవత్సరాలు అయిందని,  ప్రతి పౌరుడికీ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం ప్రసాదించిన హక్కులే మన ప్రజాస్వామ్య సౌధాన్ని కాపాడుతున్నాయని వైయ‌స్ జగన్ పేర్కొన్నారు.

Back to Top