సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఫొటోకు పాలాభిషేకం

తొలి కేబినెట్‌లో వరాల జల్లుపై సర్వాత్ర హర్షాతిరేకాలు
 

 

కర్నూలు:రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాల పట్ల కర్నూలు వాసులు ఆనందం వ్యక్తం చేశారు. కర్నూలు వైయస్‌ఆర్‌ సర్కిల్‌లోని దివంగత మహానేత వైయస్‌ఆర్‌ విగ్రహానికి , సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోకు పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ,కార్మికులకు సీఎం వరాల జల్లు కురిపించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఏపీఎస్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం పట్ల తమ జీవితాల్లో సీఎం వైయస్ జగన్‌ వెలుగులు నింపారని సంతోషం వ్యక్తం చేశారు. జీతాలు పెంచడం పట్ల మున్సిపల్‌ కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే హామీలు అమలు చేయడం గొప్ప విషయమన్నారు.

Back to Top