తెలుగు భాష‌కు నూత‌న జీవం పోసిన అక్ష‌ర యోగి సీపీ బ్రౌన్

సీపీ బ్రౌన్ వర్ధంతి సందర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

తాడేప‌ల్లి: భాషాభిమానానికి భౌతిక హ‌ద్దులు లేవ‌ని, త‌న మాతృ భాష కంటే మన తెలుగును ఎక్కువగా ప్రేమించి భాష‌కు నూత‌న జీవం పోసిన అక్ష‌ర యోగి సీపీ బ్రౌన్ అంటూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొనియాడారు. `వేమన శతకాలు, పోతన భాగవతం, పలు పాత కావ్యాలు కాలగర్భంలో కలిసిపోతున్న సమయంలో తన సొంత డబ్బుతో వందలాది తెలుగు గ్రంథాలను ముద్రించి మనకు అందించిన మహనీయుడు ఆయన. నేడు సీపీ బ్రౌన్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు` అంటూ వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న ఎక్స్ ఖాతాలో సందేశం పోస్టు చేశారు. 

Back to Top