నేడు వైయ‌స్‌ జగన్‌ నామినేషన్‌

పులివెందుల : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం మ.1.49గంటలకు పులివెందులలో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఉదయం10 గంటలకు ఆయన హెలికాప్టర్‌ ద్వారా ఇక్కడకు చేరుకుంటారు. స్థానిక సీఎస్‌ఐ చర్చి మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.   
 

Back to Top