రేపు సీఎం వైయస్‌ జగన్‌ పులివెందుల పర్యటన  

 వైయస్‌ వివేకా విగ్రహ ఆవిష్కరణకు హాజరు

వైయస్‌ఆర్‌ జిల్లా: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పులివెందుల పర్యటనకు వస్తున్నారు.   ఉదయం 9.35 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుని 9.40 గంటలకు అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 10.10 గంట లకు పులివెందుల గాయత్రి కాలనీలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 10.20 గంటలకు హెలిప్యాడ్‌ నుంచి బయలుదేరి 10.30 గంటలకు భాకరాపురం చేరుకుంటారు. 10.35 నుంచి 10.55 గంటల వరకు మాజీమంత్రి వైయస్‌ వివేకానందరెడ్డి విహ్రావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. 11.00 గంటలకు భాకరాపురం నుంచి బయలుదేరి  11.10 గంటలకు పులి వెందుల ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు వస్తారు. 11.15 గంటల నుంచి 12.15 గంటల వరకు పులివెందుల అభివృద్దిపై అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. 12.15 నుంచి 12.45 గంటల వరకు రిజర్వుడు. 12.50 గంటలకు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ నుంచి బయలుదేరి గాయత్రి కాలనీ వద్దగల హెలిప్యాడ్‌కు 12.55 గంటలకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.00 గంటకు అక్కడి నుంచి బయలుదేరి అనంతపురం జిల్లా పెనుగొండకు వెళతారు.   
 

Back to Top