రాష్ట్ర ప్రజలకు రక్షాబంధన్‌ శుభాకాంక్షలు

ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌
 

  అమరావతి: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తోబుట్టువుల మధ్య ఉన్న ప్రేమానురాగాలకు, జీవితాంతం ఒకరికొకరం తోడుగా ఉంటామనే హామీకి రక్షాబంధన్‌ ప్రతీకగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా రాఖీ పండుగ జరుపుకోవాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆకాంక్షించారు.

Back to Top