వైయ‌స్‌ వివేకానందరెడ్డికి వైయ‌స్ జగన్‌ నివాళి 

 పులివెందుల : దారుణ హత్యకు గురైన తన చిన్నాన్న వైయ‌స్ వివేకానందరెడ్డి భౌతికకాయానికి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళి అర్పించారు. శుక్రవారం సాయంత్రం పులివెందులలోని వైయ‌స్‌ వివేకానందరెడ్డి స్వగృహానికి చేరుకున్న వైయ‌స్‌ జగన్‌ ముందుగా నివాళి అర్పించి, అనంతరం ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ఆయన సతీమణి వైయ‌స్ భారతి కూడా ఉన్నారు. అంతకు ముందు వైయ‌స్‌ వివేకానందరెడ్డి భౌతికకాయన్ని సందర్శించిన దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర్‌ రెడ్డి స‌తీమ‌ణి,  వైయ‌స్ఆర్‌సీపీ గౌర‌వాధ్య‌క్షురాలు వైయ‌స్‌ విజ‌య‌మ్మ క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు

Back to Top