వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
జర్నలిస్ట్ మృతికి సీఎం వైయస్ జగన్ సంతాపం
08 Apr 2020 4:45 PM
అమరావతి: అమెరికాలో కరోనా బారిన పడిన ప్రముఖ జర్నలిస్ట్ కంచిభొట్ల బ్రహ్మానందం మరణించడంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఏపీకి చెందిన కంచిభొట్ల పాత్రికేయునిగా జీవితం ప్రారంభించారు. అనంతరం ఆంగ్ల వార్తా సంస్థ యూఎన్ఐలో పని చేశారు. తర్వాత అక్కడే న్యూయార్క్లో స్థిరపడ్డారు. జర్నలిజంలో కొనసాగుతూ పేరు ప్రఖ్యాతలు గడించారు. కొద్ది రోజుల క్రితం అతనికి కరోనా సోకింది. దీంతో అతనికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా.. సోమవారం మృతి చెందినట్లు న్యూయార్క్ వైద్యులు ధ్రువీకరించారు.