చంద్రబాబు చేసిన తప్పుకు క్షమాపణ చెప్పాలి

అసెంబ్లీలో మంచి సంప్రదాయం రావాలి

సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

అమరావతి: స్పీకర్‌ను తన సీట్లో కూర్చోబెట్టే విషయంలో చంద్రబాబు ముందుకు రాకపోవడం బాధాకరమని, ఆయన చేసిన తప్పుకు క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. స్పీకర్‌ ధన్యవాద సభలో సీఎం మాట్లాడుతూ.. స్పీకర్‌గా తమ్మినేని సీతారంను ఏకగ్రీవంగా ఎన్నుకున్న తరువాత..ఇక్కడ ఉన్న అన్ని పార్టీల నేతలు వచ్చి స్పీకర్‌ను తన సీట్లో కూర్చోవాలని ప్రోటెం స్పీకర్‌ అన్నారు. ఆ తరువాత సాదరంగా నేను లేచి, మిమ్మల్ని ఆలింగనం చేసుకొని, గౌరవప్రదంగా మిమ్మల్ని మీ సీట్లో కూర్చొబెట్టాం. చంద్రబాబు అక్కడి నుంచి లేయలేదు. అచ్చెన్నాయుడు మాత్రమే వచ్చారు. ఇంత ప్రక్రియ సాక్ష్యాత్తు కళ్లెదుటే జరిగితే కూడా దాన్ని తప్పు అని కూడా గ్రహించకుండా కప్పిపుచ్చుకుంటున్నారు. ఒక అబద్ధాన్ని నిజం చేసేందుకు వందసార్లు చెప్పిందే చెప్పి అదే నిజం అన్నది ఒక సామెత. అదే చంద్రబాబు చేస్తున్నారు. ప్రొటెం స్పీకర్‌ అందరిని ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని మన్నించి స్పీకర్‌ వద్దకు రావాల్సింది పోయి..నాకు బొట్టు పెట్టలేదని పేర్కొనడం సరైంది కాదు. స్పీకర్‌ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. రావాల్సింది పోయి చంద్రబాబు దారుణంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు తాను చేసిన తప్పుకు క్షమాపణ చెప్పాలి. ఇంతకన్నా దీన్ని ఎక్కువగా సాగదీయకూడదు.
 

Back to Top