నేను డోర్‌ తెరిస్తే ప్రతిపక్షంలో ఎవరూ ఉండరు

వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

నేను కూడా ప్రలోభాలు పెడితే బాబుకు ప్రతిపక్ష హోదా దక్కదు

నేను విలువలు పాటించటం రాష్ట్రం అంతా చూసింది

ఎమ్మెల్యేలను చంద్రబాబు సంతలో పశువుల్లా కొనటం అందరూ చూశారు

అసెంబ్లీలో మంచి సాంప్రదాయాలు రావాలి

అమరావతి: తాను కూడా ప్రలోభాలు పెడితే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని, డోర్‌ తెరిస్తే అక్కడ ఎవరూ ఉండరని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. స్పీకర్‌ ధాన్యవాద తీర్మానం సభలో చంద్రబాబు వ్యాఖ్యలపై వైయస్‌ జగన్‌ మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే సభలో ఏరకంగా చట్టాలకు తూట్లు పొడిచారో..ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్న పరిస్థితి చూశాం. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయలేదు. వారిలోనే నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి ముఖ్యమంత్రి, అటువంటి స్పీకర్‌ ఉన్న చట్టసభ కాకుండా..మంచి స్పీకర్‌ను దేవుడి దయతో మిమ్మల్ని కూర్చోబెట్టాం. మనం ఎలా చేయాలో ఉదాహరణ ఇస్తు ఇదే సభలో చెప్పాను. నేను కూడా చంద్రబాబు మాదిరిగా అలాగే చేసి ఉంటే చంద్రబాబు ప్రతిపక్ష హోదాలో కూర్చునే వాడు కాదు. నేను కూడా డోర్‌ తెరిస్తే ఎంతమంది టచ్‌లో ఉన్నారో చెప్పాల్సిన పని లేదు. ఈ అన్యాయమైన సాంప్రదాయం కొనసాగకూడదని, చట్టసభలో ప్రతిపక్షం ఉండాలని, చంద్రబాబుకు ఇంకా ఆ స్థానంలో కూర్చొబెట్టేందుకు, మంచి సాంప్రదాయం రావాలని, మంచి చేసే దిశగా మాట్లాడుతుంటే దాన్ని కూడా వక్రీకరిస్తూ అన్యాయమైన మాటలు మాట్లాడుతున్నారు. 23 మంది వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. ముగ్గురు ఎంపీలను ప్రలోభపెట్టి తీసుకున్నారు. చివరికి ఏం జరిగింది. పైన దేవుడు ఉన్నారు. ప్రజలు ఉన్నారు. ఏ స్థాయిలో గూబ గువ్వ్‌ అనే విధంగా జవాబు చెప్పారు. దేవుడు కూడా కరెక్టుగా మే 23వ తేదీన జడ్జిమెంట్‌ఇచ్చారు. కనీసం సాంప్రదాయాలు మారాలని ఇదే సభలో చెబితే దాన్ని వక్రీకరిస్తున్నారు. 

 

Back to Top