అమీన్‌ పీర్ దర్గా ఉత్సవాలు.. వైయ‌స్‌ జగన్‌కు ఆహ్వానం 

తాడేపల్లి: అమీన్‌ పీర్‌ దర్గా ఉర్సు మహోత్సవాలకు హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జగన్‌కు అహ్వానం అందింది. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కడప అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్ అరిఫుల్లా హుస్సేనీ కలిసి ఆహ్వానం అందజేశారు. 
నవంబర్‌ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ ఈ ఉర్సు మహోత్సవాలు జరుగుతున్నాయని.. ఈ ఉత్సవాలకు హజరుకావాలని వైయ‌స్‌ జగన్‌ను కోరారు. వైయ‌స్‌ జగన్‌ను కలిసిన కడప మాజీ మేయర్‌ సురేష్‌ బాబు, అమీన్ పీర్ దర్గా చీఫ్‌ ముజావర్‌ అమీరుద్దిన్‌,  మేనేజర్ మొహమ్మద్ అలీ ఖాన్, బాఖీ ఉల్లాఖాన్ ఉన్నారు. 

Back to Top