మ‌హానేత వైయ‌స్ఆర్‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

ఇడుపుల‌పాయ‌లో కుటుంబ స‌భ్యుల ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు
 

ఇడుపులపాయ: దివంగత మాజీ ముఖ‍్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబసభ్యులు బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. నేడు వైయ‌స్ఆర్‌ 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయ‌స్సార్‌ ఘాట్‌ వద్ద ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అంజలి ఘటించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి సతీమణి వైయ‌స్‌ విజయమ్మ, వైయ‌స్‌ భారతి రెడ్డి, వైయ‌స్‌‌ షర్మిల, బ్రదర్‌ అనిల్‌ కుమార్‌, ఎంపీ వైయ‌స్‌ అవినాష్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో  పాటు పలువురు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Back to Top