మన్యం జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైయస్ జగన్ సంతాపం

పార్వతీపురం మన్యం జిల్లా: పాలకొండ - సీతంపేట ఘాట్‌ రోడ్‌ వద్ద ఆటో లోయలో పడి నలుగురు ప్రాణాలు కోల్పోవడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 
శుభకార్యానికి వెళ్ళి వస్తున్న వారు ఈ ప్రమాదంలో మృతి చెందడం అత్యంత విషాదకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలో మరి కొందరు గాయపడటం ఆందోళన కలిగిస్తోందన్నారు.

మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో వారికి ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా పరిశీలించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రహదారి భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

Back to Top