ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
వైయస్ జగన్మోహన్రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వండి
31 Mar 2019 4:42 PM
జమ్మలమడుగులో వైయస్ భారతి రోడ్ షో
వైయస్ఆర్ జిల్లా : వైయస్ జగన్మోహన్రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వాలని వైయస్ భారతిరెడ్డి కోరారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరుగుతుందని వైయస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైయస్ భారతిరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో ఆదివారం ఆమె రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ భారతిరెడ్డికి జమ్మలమడుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. వైయస్ భారతిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి మంచి స్పందన లభిస్తోందని అన్నారు. చంద్రబాబుపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని అన్నారు. వైఎస్ జగన్ను ప్రజలు బాగా నమ్ముతున్నారని ఆమె పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మూల సుధీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని భారతిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
కాగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కోరుతూ.. నిన్న పులివెందులలో వైయస్ భారతిరెడ్డి ప్రచారాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో ఆమె ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ని గెలిపించాలని కోరారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడ్డారని.. వైయస్ జగన్మోహన్రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆమె విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 11న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్రెడ్డి, వైయస్ అవినాష్రెడ్డికి ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో పెరిగిన అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలను తిప్పికొట్టడానికి మార్పు అనివార్యంగా భావించి ప్రతి ఒక్కరూ వైఎస్సార్ సీపీకి ఓటు వేయాలని వైఎస్ భారతిరెడ్డి కోరారు.