మహానేత వైయ‌స్ఆర్‌కు వైయ‌స్‌ భారతి నివాళి

వైయ‌స్ఆర్ జిల్లా: ఇడుపులపాయలో దివంగత మహానేత డాక్టర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జయంతి వేడుకలు ఘ‌నంగా నిర్వహించారు. వైయ‌స్ఆర్ ఘాట్ వద్ద ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌తీమ‌ణి  వైయ‌స్‌ భారతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైయ‌స్సార్‌ జిల్లాలో వైయ‌స్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.  రాజంపేట మండలంలో రైతు దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యే కార్యాలయంలో పార్టీ జెండాను ఎగురవేశారు.
 

Back to Top