జ‌గ‌న‌న్న‌కు రాఖీ క‌ట్టిన మ‌హిళా మంత్రులు, నేత‌లు

తాడేప‌ల్లి: అన్నాచెల్లెలి బంధానికి ప్ర‌తీక అయిన రాఖీ పండుగ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి మ‌హిళా మంత్రులు, వైయ‌స్ఆర్ సీపీ మ‌హిళా నేత‌లు రాఖీ క‌ట్టారు. తాడేప‌ల్లిలోని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నివాసంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన మ‌హిళా మంత్రులు తానేటి వ‌నిత, విడ‌ద‌ల ర‌జని, రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ‌, రుడా చైర్‌ప‌ర్స‌న్ మేడ‌పాటి ష‌ర్మిలారెడ్డి, విజ‌య‌వాడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్ భాగ్య‌ల‌క్ష్మి, మ‌హిళా క‌మిష‌న్ స‌భ్యురాలు గ‌డ్డం ఉమ‌, త‌దిత‌రులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు రాఖీ క‌ట్టి శుభాకాంక్ష‌లు తెలిపారు. అదే విధంగా బ్ర‌హ్మ‌కుమారీలు కూడా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు రాఖీ క‌ట్టి శుభాకాంక్ష‌లు తెలిపారు.

Back to Top