హిందూపురం: హిందూపురం నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర దిగ్విజయంగా సాగింది. అంబేద్కర్ సర్కిల్ వద్ద జరిగిన బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలివచ్చారు. అడుగడుగునా సామాజిక సాధికారత ప్రతిధ్వనించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు అంజాద్ బాషా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుమ్మనూరు జయరాం, ఉషశ్రీ చరణ్, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే శంకరనారాయణ తదితరులు పాల్గొన్నారు. సభలో వక్తలు ఏమన్నారంటే.... ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ.... – భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి, సామాజిక సాధికారత అన్నది ఒక నినాదంగా ఉంటూ వస్తోంది. – సామాజిక సాధికారతను నిజం చేసి చూపిన నాయకుడు జగన్మోహన్రెడ్డి. మైనార్టీనైన నన్ను ఉపముఖ్యమంత్రిని చెయ్యడం వైయస్ జగన్కే సాధ్యమైంది. – కేబినెట్లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులున్నారు. నలుగురు ఉపముఖ్యమంత్రులు ఈ వర్గాల వారే. – బీసీలంటే బ్యాక్బోన్ క్లాస్లని చెప్పిన గొప్ప నాయకుడు జగన్మోహన్రెడ్డి. – మైనార్టీలు పడుతున్న కష్టాలు నాడు వైయస్సార్ గుర్తించారు. 4 శాతం రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మైనార్టీ పిల్లలకు ఎంతో మంచి చేసింది. – ఈరోజు ఆయన తనయుడిగా జగనన్న, మైనార్టీలను చెయ్యిపట్టుకుని రాజ్యాధికారం వైపు నడిపిస్తున్నారు. – నలుగురు మైనార్టీలను శాసనమండలిలో చోటు కల్పించారు జగనన్న. – రూ.2.35 లక్షల కోట్లను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు డీబీటీ ద్వారా అందించారు. మంత్రి ఉషాశ్రీచరణ్ మాట్లాడుతూ... – గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా కులాలకు అతీతంగా, పార్టీలకతీతంగా అర్హులైన ప్రతివారికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. – పేదలకు సైతం ఫ్యామిలీ డాక్టర్ను అందుబాటులోకి తెచ్చిన ఘనత జగనన్నది. – అందరికీ మేలు జరగాలంటే మనకు ముఖ్యమంత్రిగా జగనన్నే ఉండాలి. – బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలందరూ జగనన్న వెంటే నడవాలి. 56 కార్పొరేషన్లద్వారా 136 కులాలకు న్యాయం చేయాలని సంకల్పించిన జగనన్న. – బీసీలలో కులగణనకు శ్రీకారం చుట్టిన జగనన్న. వారికి మరింత మంచి జరగాలనే కోరుకుంటున్నారు. – వెనుకబడిన కులాలకు, మహిళలకు గౌరవం ఇచ్చే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. మంత్రి గుమ్మనూరు జయరామ్ మాట్లాడుతూ... – ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నిజమైన స్వాతంత్య్రం వచ్చింది. జగనన్న పాలనలోనే అది సాధ్యమైంది. – బడుగు, బలహీనవర్గాలకు ఒక ఆత్మబంధువుగా ఆదుకునే ముఖ్యమంత్రి మనకు ఉన్నారు. – బీసీలకు ఎప్పుడైనా చంద్రబాబు పెద్దపీట వేశారా? వాల్మీకినైన నేను ఐదేళ్లపాటు మంత్రిగా ఉన్నానంటే అది జగనన్న వల్లే. – వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల మన పేదల పిల్లలు పెద్ద చదువులు చదువుకోగలిగారు. – తండ్రి కన్నా ఎక్కువగా మనకు మంచి చేసేందుకు తాపత్రయపడుతున్నారు జగనన్న. – బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ కలిస్తే.. బాలకృష్ణ గిరగిరా తిరిగి పడిపోవాలి. రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.... – ఈరోజు బెంగళూరులో బీసీ నాయకులు కొందరు నన్ను కలిసి.. మా ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్లో కలపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. – ఎందుకంటే బీసీ పేదపిల్లలు ఆంధ్రప్రదేశ్లో బాగా చదువుకునే అవకాశాలున్నాయి. వారికి మంచి అవకాశాలు వస్తాయి. – చదువుకునే పిల్లలకు స్కూలు స్థాయి నుంచి ప్రొఫెషనల్ కోర్సుల వరకు ప్రభుత్వం చేయూతనిస్తోంది. – పేదల బాధలకు చలించిపోయే కరుణామయుడు జగన్మోహన్రెడ్డి. – బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లోనూ వారికోసం.. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పథకాలు లేవు. – జగన్మోహన్రెడ్డి రాజకీయనాయకుడు కాదు సంఘసంస్కర్త. – పక్కరాష్ట్రాలకు పోయి చూస్తే.. ఇక్కడ జగనన్న చేస్తున్న మంచి మనకు అర్థమవుతుంది. ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ... – నిజాయితీపరుడు, మాటతప్పని, మడమ తిప్పని నాయకుడు మన జగన్మోహన్రెడ్డి. ఆత్మగౌరవం కోసం ఢిల్లీని ఢీకొన్న నాయకుడు. – ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రతి అంచెలోనూ, అధికార పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కూర్చోబెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. – చదువుకున్న పిల్లలు ప్రపంచాన్ని జయిస్తారని నమ్మిన ముఖ్యమంత్రి, పేదపిల్లల కోసం ఎన్నెన్నో మంచి పనులు చేస్తున్నారు. – అందరితో సమానంగా, యూనిఫాం, బూట్లతో బడులకెళ్లే పరిస్థితి ఈరోజు మన పిల్లలకు ఉందంటే.. అది జగనన్న వల్లనే. – హిందూపురం ప్రజలు ఈసారి ఆలోచించి ఓటెయ్యాలి. ఎమ్మెల్యే తిప్పేస్వామి మాట్లాడుతూ... – జగనన్నను 2024లో మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడమే మనందరి కర్తవ్యం. – హిందూపురంలో కూడా వైయస్సార్సీపీ జెండా ఎగరాలి. – ఆరు నెలలకోసారి వచ్చి ముగ్గురిని తిట్టడం, ఇద్దరిని కొట్టి వెళ్లిపోవడం అన్నది ఇప్పటి ఎమ్మెల్యే బాలకృష్ణగారి పనిలా ఉంది. అలాంటి ఎమ్మెల్యే మనకవసరమా? – ఇక చంద్రబాబు చెప్పే అబద్దాల్ని నమ్మకుండా జగనన్న వెంట నడుద్దాం. – టీడీపీ అధికారంలో ఉండగా ఎస్సీలకు చేసింది ఏమీలేదు. ఎస్టీలకు చేసింది ఏమీలేదు. బీసీలకు, మైనార్టీలకు చేసింది ఏమీ లేదు. – ఆయా వర్గాలను కించపరచడం, దూషించడం, అవమానాల పాలు చెయ్యడం చంద్రబాబు తీరు. మన బలహీనవర్గాలు జగన్మోహన్రెడ్డికే ఓట్లు వెయ్యాలి. ఎమ్మెల్యే శంకరనారాయణ మాట్లాడుతూ... – రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలను అక్కున చేర్చుకుని, ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రికి ఎంతగా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. – అభివృద్ధి లక్ష్యంతో నా ఎస్సీ,నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్న మాటలకు నిజమైన అర్థం చెప్పిన జగనన్న. – నాలుగున్నరేళ్ల పాలనలో లంచాలు, వివక్షత లేకుండా, పేద, బడుగు, బలహీనవర్గాల సంక్షేమం, అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతున్న జగనన్న.