ఇంకెన్నాళ్లు భ్రమల్లో బతుకుతావు బాబూ?

వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా సమగ్ర కుటుంబ సర్వే  

కన్నా లక్షీ్మనారాయణ రూ.20 కోట్లకు అమ్ముడుపోయి ప్రభుత్వంపై తప్పడు ఆరోపణలు

 వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి

విశాఖపట్నం : మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు అధికారం కోల్పోయినా.. సీఎం అనే భ్రమలోనే ఉన్నారని, ఇలా ఎన్నాళ్లు బతుకుతావని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.  కరోనా వైరస్‌ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తుంటే.. ఇలాంటి విపత్కర పరిస్థితులలో కూడా చంద్రబాబు నాయుడు రాజకీయ విమర్శలు చేయడం సిగ్గు చేటని అన్నారు. ఆదివారం విశాఖలో ఆయన  మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చొని ఏపీ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. అధికారం కోల్పోయినా తానే ముఖ్యమంత్రిని అనుకుని చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ పెడుతున్నారని మండిపడ్డారు. 

తన సలహాలతోనే మోదీ నడుచుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.  జూమ్‌ యాప్‌లో తీసేసిన తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బాబు ఆదేశాలతో విశాఖపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి.. దాని ద్వారా ప్రజల ఆరోగ్య పరిస్థితలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటన్నామని చెప్పారు. కన్నా లక్షీ్మనారాయణ రూ.20 కోట్లకు అమ్ముడుపోయి ప్రభుత్వంపై తప్పడు ఆరోపణలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.  
 

Back to Top