కులం, వృత్తిని దూషించి యావజ్జాతిని అవమానిస్తారా? 

 
చంద్రబాబుపై విజయసాయిరెడ్డి మండిపాటు

 అమరావతి: . కులం, వృత్తిని దూషించి యావజ్జాతిని అవమానిస్తారా? అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ప్రశ్నించారు. మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ను కులం పేరిట సోషల్‌ మీడియాలో దూషించిన ఉదంతంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఛీ.. ఇంత నీచానికి తెగబడాల్సిన అవసరముందా చంద్రబాబుగారూ'' అంటూ నిలదీశారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన యువకుడు ఇరిగేషన్ మంత్రి అయితే.. కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు 

ఇక, చంద్రబాబు ఎవరింట్లో పాదం మోపినా, కరచాలనం చేసినా ఆ వ్యక్తులు రాజకీయంగా పతనం అవడం యాదృచ్ఛికమేమీ కాదని, ఆ పాద మహిమ అలాంటిదని పేర్కొంటూ.. చిదంబరం అరెస్టు, శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారడం ఉదంతాలను ప్రస్తావించారు.  

Back to Top