వేంప‌ల్లి మండ‌లంలో 'గడప గడపకు మన ప్రభుత్వం'

 పాల్గొన్న ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి

వైయ‌స్ఆర్ జిల్లా:  వేంప‌ల్లి మండ‌లంలోని  టీ వెలమవారిపల్లి, ఎస్సీ కాలనీ,నేలవరంతండాల్లో క‌డ‌ప ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తులు ఎంపీకి ఘనంగా స్వాగతం పలికారు. ప్రతి గడపకు వెళ్లి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అందిస్తున్న పథకాలను ఆయన వివరించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతీ పథకం అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు. 

Back to Top