వైయస్ జగన్‌కు విజయం సిద్ధించాలని యాగం చేప‌ట్టిన వేద పండితులు

ముఖ్య‌మంత్రితో రాజశ్యామల సహస్ర చండీయాగ సంకల్పం చేయించి ఆశీర్వ‌దించిన వేద‌పండితులు

ప్రకాశం జిల్లా:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఎన్నిక‌ల్లో విజ‌యం సిద్ధించాల‌ని కాంక్షిస్తూ అరిమండ వరప్రసాదరెడ్డి, పడమట సురేష్‌బాబు ఆధ్వర్యంలో వేద పండితులు శివప్రసాదశర్మ, నాగేంద్రశర్మలు యాగం చేపట్టారు. వెంకటాచలంపల్లి నైట్‌ స్టే పాయింట్‌ వద్ద ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌తో రాజశ్యామల సహస్ర చండీయాగ సంకల్పం చేయించి, అనంతరం వేద ఆశీర్వచనం అందించిన వేద పండితులు. 

41 రోజుల పాటు రాజశ్యామల సహస్ర చండీయాగం నిర్వహించనున్న నల్లపెద్ది శివరామప్రసాదశర్మ, గౌరావర్జుల నాగేంద్రశర్మలు.

ప్రజాహిత పాలన చేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌కు విజయం సిద్ధించాలని ఆకాంక్షిస్తూ అరిమండ వరప్రసాదరెడ్డి, పడమట సురేష్‌బాబు ఆధ్వర్యంలో యాగం చేపట్టిన వేద పండితులు శివప్రసాదశర్మ, నాగేంద్రశర్మలు.

Back to Top