మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
గుంటూరు దుర్ఘటన అత్యంత బాధాకరం
15 Aug 2021 3:01 PM
హత్యకు గురైన రమ్య మత్యదేహాన్ని పరిశీలించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ
గుంటూరు: గుంటూరు నగరం లో పట్టపగలు స్వాత్రంత్ర దినోత్సవం రోజున ఓ అమ్మాయిని దారుణంగా హత్య చేసిన దుర్ఘటన అత్యంత బాధాకరం, దురదృష్టకరమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. కత్తిపోట్లతో దారుణ హత్య కు గురైన రమ్య మృత దేహాన్ని మహిళా కమిషన్ ఛైర్-పర్సన్ వాసిరెడ్డి పద్మ పరిశీలించి, నివాళులర్పించారు. అనంతరం గుంటూరు జిల్లా ఎస్పీ తో ఆమె మాట్లాడారు. మెడ పైన, పొత్తి కడుపులో ఆరు చోట్ల కత్తి తో తీవ్రంగా గాయపరచడం వల్ల రమ్య వెంటనే చనిపోయిందని చెప్పారు. పరిచయస్థుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తుంది. నిందితుడికి కఠిన శిక్ష పడే విధంగా చూస్తామని వాసిరెడ్డి పద్మ బాధిత కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.