సీఎం వైయ‌స్‌ జగన్‌తో ఉత్తరప్రదేశ్‌ సీఎం స్పెషల్‌ అడ్వైజర్‌ సాకేత్‌ మిశ్రా భేటీ

తాడేప‌ల్లి:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో  ఉత్తరప్రదేశ్‌ సీఎం స్పెషల్‌ అడ్వైజర్‌ సాకేత్‌ మిశ్రా భేటీ అయ్యారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో సాకేత్ మిశ్రా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో స‌మావేశ‌మై ప‌లు అంశాల‌పై చ‌ర్చిస్తున్నారు.

సీఎంతో సమావేశం అనంతరం ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను పంచుకున్న సాకేత్‌, మిశ్రా...ఏమన్నారంటే, ఆయన మాటల్లోనే*

 ఏపీలో పర్యటన మాకు మంచి అనుభవాన్ని ఇచ్చింది, ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమాన్ని చూసి చాలా నేర్చుకోవచ్చు. క్షేత్రస్ధాయిలో  విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, మెరుగుపరుస్తున్న తీరును స్వయంగా పరిశీలించాను. చివరి వ్యక్తికి కూడా వీటిని అందించడానికి సీఎంగారు చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించక తప్పదు. ఇలాంటి కార్యక్రమాల వెనుక లక్ష్యాలు, ఉద్దేశాలపై ఆయనతో నేను చర్చించాను. చివరి పేద వ్యక్తికి కూడా ప్రభుత్వ పథకాలు అందాలన్నదే తన ఉద్దేశం అని చెప్పారు. ఈ సందర్భంగా గాంధీజీ చెప్పిన మాటలను ఆయన నాతో ప్రస్తావించారు.  ప్రజలకు వైద్య సేవలు అందించడానికి, వారి ఆరోగ్య చరిత్రను నిక్షిప్తం చేయడం తదితర కార్యక్రమాలను సమన్వయం చేయడం, ఈ కార్యక్రమాలు సజావుగా నడవటానికి ఐటీ, సహా ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడం బాగుంది. గ్రామ సచివాలయ వ్యవస్ధ అనేది ఒక విప్లవాత్మకమైన, గొప్పదైన కాన్సెప్ట్‌గా భావిస్తున్నాను. ఏపీలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు తెలిసేలా ప్రచురించాలి, ప్రసారం చేయాలి. దీనివల్ల వీటిలో మెరుగైన అంశాలను ఇతర రాష్ట్రాలు తీసుకుని, వాటి నుంచి లబ్ధిపొందేందుకు అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. ప్రతి రాష్ట్రం కూడా భిన్నమైనదే. ప్రతి రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం నేర్చుకోవాల్సింది ఉంటుందని నా అభిప్రాయం. కాకపోతే ఇక్కడ చేస్తున్న పనులు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గ్రామంలో ప్రభుత్వ సేవలపై ఎవరికి ఏ అవసరం వచ్చినా పలు రకాల ఆఫీసులు తిరిగేకన్నా, గ్రామ సచివాలయం కేంద్రంగా అన్నింటికి పరిష్కారం లభించడం విప్లవాత్మక ప్రగతిగా భావిస్తున్నాను. అన్ని ప్రభుత్వ వ్యవస్థలు గ్రామంలో ఒక కేంద్రంలో సమన్వయం చేసుకోవడం అన్నది హర్షిందగ్గ విషయం. టెక్నాలజీని అన్ని రంగాలలో సమర్ధంగా వినియోగిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో బహుళ కార్యక్రమాలకు కేంద్రంగా అక్కడున్న వనరులను వాడుకుంటున్న తీరు చాలా గొప్పది. ఏపీలో పర్యటన ద్వారా చాలా నేర్చుకున్నాను.రైతులకు అందుబాటులోకి తీసుకు వస్తున్న డ్రోన్‌ల వ్యవస్థ ఆకట్టుకుంది. కేవలం పది నిముషాలలోనే ఎకరంలో పురుగుమందుల పిచికారి చేయడం గొప్ప విషయం. రైతుకు అవసరమైన ఎరువులు, పురుగుమందులు ఇలా ప్రతిదీ కూడా ఒక్క చోట లభ్యమవడం అన్నది గొప్ప మార్పు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు పూర్తిగా ఆర్‌బీకేలు సేవలందించడం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రైతులు ఇ–క్రాపింగ్‌ ద్వారా ముందస్తుగా రిజిస్టర్‌చేసుకోవడం, అంతేకాకుండా పంట విక్రయం సమయంలో తాను ఎంత పరిమాణంలో అమ్ముతున్నాను, ఎంత రేటు వస్తుందనే విషయం వారికి అక్కడే తెలియడం చాలా బాగుంది. ఆర్బీకేల్లో రైతులు పంటను విక్రయించాక అక్కడితో రైతు పని ముగుస్తుంది, ఆతర్వాత ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం కూడా బాగుంది. పంటలకు ఏదైనా విపత్తు వచ్చినా ఆదుకుంటున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, మద్దతు ధర కల్పించడం ఇలా ప్రతి విషయంలో కూడా రైతుకు అండగా నిలుస్తున్న ప్రభుత్వ చర్యలు చాలా బావున్నాయి. ధ్యాంక్యూ. 

*ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ఇతర ఉన్నతాధికారులు*.

తాజా వీడియోలు

Back to Top