కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ఈ నెల 11 సీఎం వైయస్ జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు
09 Oct 2021 3:17 PM
ఆదివారం నుంచి క్షురకులను రెట్టింపు చేయాలని అధికారులకు ఆదేశం
భక్తులకు నీడ కల్పించడానికి చర్యలు
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుమల: ఈ నెల 11వ తేదీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అలాగే తిరుపతిలో చిన్న పిల్లల గుండె జబ్బు చికిత్స ఆసుపత్రిని ప్రారంభిస్తారన్నారు. శనివారం ఆయన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ.. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. అప్పలాయగుంట ఆలయం వద్ద ఏర్పాటుచేసిన కల్యాణ కట్ట లో భక్తులు అధిక సంఖ్యలో తలనీలాలు సమర్పిస్తున్నారని చెప్పారు. ఆదివారం నుంచి ఈ కల్యాణ కట్టలో సిబ్బందిని రెట్టింపు చేయడానికి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఆలయంలో తగినంతమంది అర్చకులను కూడా నియమిస్తామన్నారు. శనివారం రోజు ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నందువల్ల స్వామివారి దర్శనం కోసం ఎండలో నిలబడాల్సి వస్తోందని భక్తులు చైర్మన్ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన సుబ్బారెడ్డి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు నీడ కల్పించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ నెల 11వ తేదీ ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. తిరుపతిలో చిన్న పిల్లల గుండె జబ్బు చికిత్స ఆసుపత్రిని ప్రారంభిస్తారన్నారు. అలిపిరి నుంచి తిరుమలకు దాత నిర్మించిన పైకప్పును, అలిపిరి వద్ద మరో దాత నిర్మించిన గోమందిరాన్ని ప్రారంభిస్తారని చెప్పారు.
12వ తేదీ తిరుమలలో దాత నిర్మించిన నూతన బూందీపోటును, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కన్నడ ,హింది ఛానళ్లను ప్రారంభిస్తారనితెలిపారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవ రాజ్ బొమ్మై పాల్గొంటారని తెలిపారు. అంతకు ముందు శ్రీ సుబ్బారెడ్డి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.