రేపు సత్యసాయి జిల్లాకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

అనంత‌పురం: ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మంగ‌ళ‌వారం సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో పర్యటించనున్నారు. 2021 ఖరీఫ్‌ పంటల బీమా పరిహారాన్ని లబ్ధిదారులకు చెల్లించనున్నారు. సీఎం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.50 గంటలకు చెన్నేకొత్తపల్లి చేరుకుంటారు. 11.15 గంటల నుంచి 12.45 గంటల వరకు బహిరంగ సభ, రైతులతో ముఖాముఖి ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 2.50 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు.

తాజా వీడియోలు

Back to Top