రేపు తూర్పుగోదావరి జిల్లాలో సీఎం వైయ‌స్‌ జగన్‌ పర్యటన

అమ‌రావ‌తి:   ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ నెల 21వ తేదీ(గురువారం) తూర్పుగోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. బిక్కవోలు మండలం బలభద్రపురంలో బిర్లా గ్రూప్‌ కాస్టిక్‌ సోడా యూనిట్‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభిస్తారు.  ఈ కార్య‌క్ర‌మానికి సీఎం వైయ‌స్‌ జగన్‌తో పాటు  ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లా హాజ‌రు కానున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బలభద్రపురం చేరుకుంటారు. అక్కడ గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ కాస్టిక్‌ సోడా ప్లాంట్‌ను కుమార మంగళం బిర్లాతో కలిసి సందర్శించిన అనంతరం జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత 12.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.

Back to Top