టీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్న
నేడు అనంతపురంలో సమర శంఖారావం
11 Feb 2019 10:45 AM
అనంతపురం: ఏపీ ప్రతిపక్ష నేత,వైయస్ఆర్సీపీ పార్టీ అ«ధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు అనంతపురం జిల్లాలో జరుగనున్న ఎన్నికల సమర శంఖారావం కార్యక్రమంలో పాల్గొంటారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో రూపకల్పన చేసిన ఈ సమర శంఖారావం కార్యక్రమాల్లో ఆయన ఇప్పటికే రెండు జిల్లాలు పూర్తిచేశారు. ఈనెల 6న చిత్తూరు (తిరుపతి),7న వైయస్ఆర్ జిల్లాల్లో జరిగిన సభలో పాల్గొని పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. నేడు అనంతపురం వేదికగా శంఖారావం పూరిస్తారు. ఉదయం 11 గంటలకు అనంతపురం నగరానికి చేరుకుంటారు. అక్కడ శ్రీ 7 కన్వెన్షన్ హాలుకు చేరుకుని వివిధ రంగాల్లో పనిచేస్తున్న తటస్థులతో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటలకు బెంగళూరు రోడ్డులో ఉన్న అశోక్ లేల్యాండ్ షోరూంకు ఎదురుగా ఉన్న స్థలంలో అనంతపురం జిల్లా వైయస్ఆర్సీపీ పార్టీ బూత్ కమిటీ సభ్యులు,కన్వీనర్లతో ‘సమర శంఖారావం’ సభలో పాల్గొంటారు.