తిరుపతిలో వైయ‌స్ఆర్ సీపీదే హవా

అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ ఫ్యాన్‌దే విజ‌యం

మే 2న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఫలితాలు 

అమరావతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. తన సిట్టింగ్‌ స్థానాన్ని వైయ‌స్ఆర్  కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ సొంతం చేసుకుంటుందని అన్ని సర్వేలు తేల్చి చెప్పాయి. ఆరా ఎగ్జిట్‌ పోల్ ఫలితాలు వైయ‌స్ఆర్ సీపీ 65.85%, తెలుగుదేశం పార్టీ 23.10%, బీజేపీ 7.34% ఓట్లు సాధిస్తాయని తెలిపింది. ఎగ్జిట్‌ పోల్ ఫలితాలకు తుది ఫలితాలకు 2 నుంచి 3 శాతం వరకు తేడా ఉండొచ్చని వెల్లడించింది.

ఆత్మసాక్షి ఎగ్జిట్‌ పోల్ ఫలితాల ప్రకారం వైయ‌స్ఆర్ సీపీ 59.25%, టీడీపీ 31.25%, బీజేపీ 7.5% ఓట్లు సాధిస్తాయని స్పష్టం చేసింది. వైయ‌స్ఆర్ సీపీ అభ్యర్థి గురుమూర్తి తిరుపతి ఎంపీగా విజయం సాధించనున్నారని అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, మే 2వ తేదీ ఆదివారం తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి.

 

తాజా వీడియోలు

Back to Top