థ్యాంక్యూ సీఎం స‌ర్‌

అనంత‌పురం: గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ను  ఖరారు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి   ఇటీవల జీవో విడుదల చేసిన సందర్భంగా గురువారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో ఉద్యోగులు సంబ‌రాలు చేసుకున్నారు. ఈ మేర‌కు గ్రామ సచివాలయం దగ్గర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహ‌న్ రెడ్డి చిత్రపటానికి గ్రామ సచివాలయ ఉద్యోగులతో కలిసి మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్‌ పాల అభిషేకం చేశారు. మ‌హానేత విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.  అనంతరం కేక్ కట్ చేసి వేడుక‌లు జ‌రుపుకున్నారు.

Back to Top