‘వైయ‌స్‌ జగన్‌ మళ్లీ సీఎం కావాలి’

ఏపీకి చేరుకున్న తెలంగాణ‌వాసి సైకిల్‌ యాత్ర
 

విజ‌య‌వాడ‌:  వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండోసారి కూడా ముఖ్య‌మంత్రి కావాలని కోరుతూ తెలంగాణకు చెందిన వైయ‌స్ఆర్‌సీపీ నేత చేపట్టిన సైకిల్‌ యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించింది. జనగామ జిల్లా బచ్చనపేట మండలం లింగంపల్లికి చెందిన బొడ్డు ప్రవీణ్‌ రెండోసారి వైయ‌స్ జగన్‌ సీఎం కావాలని కోరుతూ ఈ నెల 21న జనగామ నుంచి తాడేపల్లి వరకు సైకిల్‌ యాత్ర ప్రారంభించారు. 
సోమవారం ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటకు యాత్ర చేరుకోవడంతో.. పట్టణంలోని బైపాస్‌ రోడ్డులోని దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా నిలుస్తున్న సీఎం వైయ‌స్‌ జగన్‌ రెండో సారి కూడా ముఖ్యమంత్రి అయితే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని చెప్పారు. ప్రజలు, భగవంతుడి ఆశీస్సులతో ఆయన కచ్చితంగా విజయం సాధిస్తారని తెలిపారు.

Back to Top