రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
వైయస్ జగన్ పై అసభ్యకరమైన కామెంట్లు చేసిన టీడీపీ కార్యకర్త అరెస్టు
09 Jul 2019 12:36 PM
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై అసభ్యకరమైన కామెంట్లు చేసిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా పెనుమూరులోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన టీడీపీ కార్యకర్త రాజేశ్ నాయుడు మే 28న ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై ఫేస్ బుక్ లో అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన వైయస్ఆర్సీపీ నేత నరసింహారెడ్డి పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఐపీసీ సెక్షన్ 506, ఐటీ చట్టం కింద రాజేశ్ పై కేసు నమోదుచేసిన పోలీసులు, నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆయన్ను ఈరోజు కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్ కు తరలించనున్నారు. ఏప్రిల్ 11న ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమపై రాజేశ్ దాడి చేసినట్లు గతంలోనే వైయస్ఆర్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పుడు కూడా పోలీసులు రాజేశ్ పై కేసు నమోదు చేశారు.