టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైయస్‌ఆర్‌ సీపీలో చేరిక

రమేష్‌బాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం

తాడేపల్లి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన రమేష్‌బాబు సీఎం సమక్షంలో వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ రమేష్‌బాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 
 

Back to Top