టెన్త్‌, ఇంటర్ పరీక్షలు రద్దు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇంటర్‌ పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగిందని.. సుప్రీం ఆదేశాల ప్రకారం జులై 31 నాటికి పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని తెలిపారు. ఈ విషయాన్ని సీఎం వైయ‌స్ జగన్‌ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. పరీక్షల నిర్వహణ, ఫలితాలకు 45 రోజుల సమయం పడుతుందని మంత్రి సురేష్‌ పేర్కొన్నారు.

Back to Top