మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
అరకులోయకు విస్టా డోమ్ కోచ్ లతో ప్రత్యేక రైలు
22 Nov 2021 3:45 PM
విశాఖ: అరకులోయకు వెళ్లే టూరిస్టులకు రైల్వే శాఖ సరికొత్త అనుభూతి కలిగించేందుకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ఈ రైలును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. అరకు వెళ్లే పర్యాటకుల కోసం విశాఖ నుంచి అరకులోయకు విస్టా డోమ్ కోచ్ లతో ప్రత్యేక రైల్ ను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకు ప్రాంతానికి వెళ్లే టూరిస్టులకు ఈ రైలు ద్వారా సరికొత్త అనుభూతి లభిస్తుందని అన్నారు. టూరిస్టులను మరింతగా ఆకర్షించేందుకు ఈరైలు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. టూరిజం పరంగా రాష్ట్ర ప్రభుత్వం టూరిస్టులకు అనేక సౌకర్యాలు కల్పిస్తోందని అన్నారు. టూరిస్టులు ఈ సౌకర్యాలను ఉపయోగించుకుని విహారయాత్రను విజయవంతం చేసుకోవాలని కోరారు.