షహీద్ బాబా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు

ఫ‌తేహాలు స‌మ‌ర్పించిన  వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు వి.ఖాదర్ బాషా 
 

విజ‌య‌వాడ‌: న‌గ‌ర శివారు భవానిపురం లోని హజరత్ సయ్యద్ గాలిబ్ షహీద్ బాబా దర్గాలో శనివారం ప్ర‌త్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు వి.ఖాదర్ భాషా హజరత్ సయ్యద్ గాలిబ్ షహీద్ దర్గా కమిటీ  ఆహ్వానం మేరకు  దర్గాను సందర్శించారు .అనంతరం దర్గా కమిటీ సభ్యులు, ముస్లిం ప్రముఖులు  ఖాదర్ భాషాను పూలమాలలతో, శాలువా కప్పి కిరీటం (టోపీ) బహుకరించారు.  ఫ‌తేహాలు స‌మ‌ర్పించిన  వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు వి.ఖాదర్ బాషా . ఆయనతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్,  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం కృష్ణా జిల్లా అధ్యక్షుడు అయూబ్ ఖాన్, భవానిపురం కార్పొరేటర్ మొహమ్మద్ ఇర్ఫాన్, ముస్లిం మైనార్టీ నాయకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

తాజా వీడియోలు

Back to Top