కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
నేషనల్ జుడిషియల్ కమిషన్ను పునరుద్ధరించాలి
01 Apr 2022 3:35 PM
రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టిన విజయసాయి రెడ్డి
న్యూఢిల్లీ : నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్జేఏసీ)నమి పునరుద్ధరించేందుకు వీలుగ రాజ్యాంగ సవరణను చేపట్టాలని కోరుతూ వైఎస్సార్సీపీ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి శుక్రవారం రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. నేషనల్ జడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని 2015లో సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును పరిగణలోకి తీసుకుని ఉన్నత న్యాయస్థానాలలో న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలు, పోస్టింగ్లపై తుదినిర్ణయం తీసుకునేందుకు ఎన్జేఏసీని పునరుద్ధరించడం ఈ బిల్లు లక్ష్యంగా ఆయన అభివర్ణించారు. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 124, 217, 222ను సవరించాలని ప్రతిపాదిస్తూ ఆయన ఈ బిల్లును ప్రవేశపెట్టారు.