ఆగస్ట్‌ 3న ఏపీలో పాఠశాలలు ప్రారంభం

 
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలకు వేసవి సెలవులను ప్రభుత్వం పొడిగించింది. ఆగస్ట్‌ 3న రాష్ట్రంలోని పాఠశాలన్నీ ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నాడు-నేడు కార్యక్రమంపై సమీక్షంలో భాగంగా పాఠశాలల అభివృద్ధిపై సీఎం ఆరా తీశారు. జులై నెలా ఖరులోగా మొదటి విడతలో చేపట్టిన 15,715 స్కూళ్లలో నాడ-–నేడు కింద అభివృద్ధి పనులు పూర్తిచేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు.  

రూ.456 కోట్ల రివాల్వింగ్‌ ఫండ్‌ విడుదల
ప్రతి పాఠశాలలో 9 రకాల సదుపాలను కల్పించేందుకు రూ.456 కోట్ల రివాల్వింగ్‌ ఫండ్‌ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విడుదల చేశారు.  జులై నెలాఖరు కల్లా అన్ని స్కూళ్లలో పనులు పూర్తి చేసే విధంగా ఆయా జాల్లా కలెక్టర్లు పనులపై ప్రతిరోజూ సమీక్ష చేయాలి సూచించారు.  మరోవైపు పాఠశాలల అభివృధి పనుల కోసం సిమెంటు, ఇసుక సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. 

Back to Top