మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వంగపండు'కు వందనం
26 Mar 2021 1:09 PM
ప్రజాకవి వంగపండు ప్రసాద రావు వర్ధంతి సందర్భంగా ఏటా జానపద పురస్కారం.
కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక చేయూత
అమరావతి: ఉత్తరాంధ్ర ఉద్యమానికి ఊపిరులూదుతూ... సిక్కోలు నక్సల్స్ బరి ఉద్యమాన్ని తన గీతాలతో ఉరకలెత్తించిన గాయకుడు..ఉద్యమ కారుడైన వంగ పండు ప్రసాదరావుకు ప్రభుత్వం అరుదైన నివాళి అర్పించింది. విశేష జనాదరణ పొందిన 400 కు పైగా జానపద గీతాలు రాచించిన వంగపండు వర్ధంతిని పురస్కరించుకుని ప్రత్యేక పురస్కారాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఏటా ఆగస్టు 4వ తేదీన "వంగపండు ప్రసాదరావు జానపద పురస్కార ప్రదాన కార్యక్రమం" నిర్వ హిస్తామంటూ రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పురస్కారం కింద ఏటా రూ.2 లక్షలు నగదు బహుమతి అందించ నున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా జానపద కళాకారుడు వంగపండు కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది.