19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
పాత, కొత్త కలయికతో కేబినెట్ కూర్పు
09 Apr 2022 5:02 PM
బీసీలకు ప్రాధాన్యత, మహిళలకు సముచిత స్థానం
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
తాడేపల్లి: పాత, కొత్త కలయికతో కేబినెట్ కూర్పు ఉంటుందని, కేబినెట్ కసరత్తు కొనసాగుతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డితో సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. సుమారు 3గంటల పాటు సమావేశం సాగింది. భేటీ అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. రేపు మధ్యాహ్నం వరకు కేబినెట్ కూర్పుపై కసరత్తు జరుగుతుందని చెప్పారు. కాబోయే మంత్రులకు రేపు ఫోన్లు చేస్తారని, కేబినెట్లో బీసీలకు ప్రాధాన్యత, మహిళలకు సముచిత స్థానం ఉంటుందన్నారు. అన్ని అంశాలను సీఎం వైయస్ జగన్ పరిశీలిస్తున్నారని చెప్పారు.