టీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం
సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యతల స్వీకరణ
27 Jun 2019 1:02 PM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో పెనుమార్పులు జరుగుతున్నాయని సజ్జల పేర్కొన్నారు. గత పాలకుల అవినీతిని ఎండగడుతున్నారని తెలిపారు. ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పాలనను అనుకరిస్తూ తనదైన శైలిలో వైయస్ జగన్ పాలన సాగిస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సీఎం వైయస్ జగన్ చేస్తున్న యజ్ఞంలో నా వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఏపీ ప్రజా వ్యవహారాల సలహాదారుడిగా విలువైన సలహాలు, సూచనలు చేస్తానని చెప్పారు.