ఇచ్చిన మాట నెరవేర్చిన సీఎం వైయస్‌ జగన్‌

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
 

తాడేపల్లి: ఏపీ ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట ప్రకారమే అగ్రిగోల్డ్‌ బాధితులను సీఎం వైయస్‌ జగన్‌ ఆదుకున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన సజ్జల మాట్లాడుతూ..చంద్రబాబు పాలనలో అగ్రిగోల్డ్‌ సమస్య సృష్టిస్తే..ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో సమస్య పరిష్కారమవుతోందని పేర్కొన్నారు. కోట్ల విలువైన అగ్రిగోల్డు ఆస్తులపై టీడీపీ నేతల కన్ను పడిందని విమర్శించారు.వందల మంది అగ్రిగోల్డు బాధితులు చనిపోయినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.

Read Also: ఐదు నెలల్లో 80 శాతం హామీలు నెరవేర్చాం

Back to Top