వర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదు
ఉదారంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.50లక్షల చొప్పున పరిహారం
09 Aug 2020 12:43 PM
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి
కృష్ణా: విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. ‘ప్రైవేటు ఆస్పత్రి లీజుకు తీసుకున్న హోటల్లో అగ్ని ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నా. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. బాధితులను ఆదుకునేందుకు ఉదారంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.50లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ ఘటన కారకులపై కఠిన చర్యలు ఉంటాయి’ అని సజ్జల రామకృష్ణారెడ్డి ట్వీట్ చేశారు.