రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
బాధ్యతాయుతమైన పాత్రికేయం అవసరం
17 Aug 2021 10:27 AM
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
ఆర్వీఆర్, దేవిరెడ్డికి గజ్జెల మల్లారెడ్డి స్మారక పురస్కారాల ప్రదానం
వైయస్ఆర్ కడప : యూనివర్సిటీలు ప్రజల పక్షాన నిలబడే బాధ్యతాయుతమైన పాత్రికేయులను తయారుచేసేలా జర్నలిజం కోర్సులను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైయస్సార్ జిల్లా కడపలోని సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో నిర్వహించిన ప్రముఖ కవి గజ్జెల మల్లారెడ్డి స్మారక పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. మల్లారెడ్డి కవిత్వంలో వాడి, వేడి, నాడి, పదును ఉండడంవల్లే ఆయనకు విశిష్టస్థానం లభించిందన్నారు.
ఆయన పేరుతో ఇస్తున్న ఈ అవార్డులు అందుకుంటున్న వారిలో ఆయన స్ఫూర్తితో పాత్రికేయ రంగంలో విశిష్ట స్థానం అందుకున్న వారే ఉండడం అభినందనీయమన్నారు. నేడు ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి సంకుచిత భావాలతో పత్రికలు నడుస్తున్నాయన్నారు. ఇలాంటి పత్రికలు ప్రజాశ్రేయస్సే పరమావధిగా నడిస్తే మంచి మనుగడ ఉండగలదని చెప్పారు. గజ్జల మల్లారెడ్డి హయాంలో ఉన్నప్పటి మీడియా మళ్లీ తిరిగి రావాలని తాను ఆకాంక్షిస్తున్నానని సజ్జల తెలిపారు. గజ్జల మల్లారెడ్డి ముక్కుసూటి మనిషి. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని మీడియాలోకి వచ్చిన వారిలో నేనూ ఒకడిని. మల్లారెడ్డి లాగానే విలువలతో కూడిన జర్నలిజాన్ని, సమాజానికి ఉపయోగపడే జర్నలిజాన్ని ప్రోత్సహించాలి’’అని దేవిరెడ్డి శ్రీనాథ్రెడ్డి పిలుపునిచ్చారు. గజ్జల మల్లారెడ్డి అలనాటి అభ్యుదయ కవి, కమ్యూనిస్టు పార్టీ నేత. అప్పట్లో ఈనాడు, ఆంధ్రభూమి, ఉదయం పత్రికల సంపాదక వర్గ సభ్యుడిగా పనిచేశారు. మల్లారెడ్డి గేయాలు, శంఖారావం వంటి కవితా సంకలనాలను రచించారు.
అనంతరం.. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథరెడ్డి, విశాలాంధ్ర దినపత్రిక సంపాదకులు ఆర్వీ రామారావుకు గజ్జెల మల్లారెడ్డి స్మారక పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డిని సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. ఈ కార్యక్రమంలో యోగి వేమన విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య మునగాల సూర్యకళావతి, రిజిస్ట్రార్ ఆచార్య దుర్బాక విజయరాఘవ ప్రసాద్, నెల్లూరు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం కుల సచివులు డాక్టర్ ఎల్వీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.